Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సమాచార హక్కు చట్టంపై అవగాహన

సమాచార హక్కు చట్టంపై అవగాహన

సమాచార హక్కు చట్టంపై అవగాహన

సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ రహిమాన్, వ్యవసాయ ఏడి. కృష్ణయ్య

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని గోట్లురు రైతు సేవా కేంద్రంలో ధర్మవరం మండల వ్యవసాయ శాఖ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి సమాచారం హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ రెహ్మాన్ వ్యవసాయ శాఖ ఏడి కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం యొక్క ప్రాధాన్యత, చట్టంలోని పలు అంశాలను సిబ్బందికి వివరించడం జరిగింది. సమాచారం ఇవ్వడంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా వివరించామని వారు తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచారం భద్రపరచాలని తర్వాత వచ్చే వారికి అప్పగించారని వారు తెలపడం జరిగిందన్నారు. అంతేకాకుండా సమాచార హక్కు చట్టం సమాచారం రిజిస్టర్లు నిర్వహించాల్సిందిగా తాము సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముస్తఫా సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక సభ్యులు ఆయాజ్ భాష, లింగమయ్య, పోతులయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : సమాచార హక్కు చట్టంపై అవగాహన)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!