Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రూరల్ క్రికెట్ లీగ్ పోటీల్లో ధర్మవరం జట్టు విజయం

రూరల్ క్రికెట్ లీగ్ పోటీల్లో ధర్మవరం జట్టు విజయం

0

రూరల్ క్రికెట్ లీగ్ పోటీల్లో ధర్మవరం జట్టు విజయం

కోచ్ రాజ్ శేఖర్

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని ఆర్డిటి క్రికెట్ మైదానం లో ఆర్ డి టి నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్ లో భాగంగా ధర్మవరం నార్పల అండర్-15 బాలుర జట్టు, ధర్మవరం అండర్-15 బాలుర జట్టు తెలపడగా ధర్మవరం జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించిందని కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలుత ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ధర్మవరం జట్టు 40 ఓవర్లలో 211/9 చేసింది అని,ధర్మవరం జట్టులోని కార్తీక్ 67,తేజ 53 పరుగులతో సత్తా చాటా రు అని తదుపరి నార్పల జట్టు బౌలర్ సాయి 4 వికెట్లు కాగా అనంతరం బ్యాటింగ్‌కి దిగిన నార్పల జట్టు 32.4 ఓవర్లలో 170/10 పరుగులు చేయడంతో ధర్మవరం జట్టు 41 పరుగుల తేడతో విజయం సాధించింది అని తెలిపారు. నార్పల జట్టులోని చిరంజీవి 51 పరుగులు చేసాడు అని,ధర్మవరం జట్టులోని లోకనాథ్ 4 వికెట్లు, సాంబశివ 3 వికెట్లు సాధించారు అని తెలిపారు. తదుపరి గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : రూరల్ క్రికెట్ లీగ్ పోటీల్లో ధర్మవరం జట్టు విజయం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version