ఆర్టీసీ ఈడికి వినతిపత్రం అందజేసిన ఇ. యు. నాయకులు
న్యూస్ తెలుగు / వినుకొండ : శుక్రవారం వినుకొండ ఆర్టిసి డిపోలో నూతన బస్సులు ప్రారంభోత్సవం సందర్భంగా డిపోకు విచ్చేసిన ఆర్టీసీ ఈడి. వెంకటేశ్వరరావుకు వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పి సాంబశివరావు. ఎస్కే కాజా తదితరులు అందజేశారు. 1/19 సర్కులర్ అమలు చేయాలని, మంత్లీ ఇన్సెంటివ్, టైర్ రిమూవల్ మిసన్, వెల్డింగ్ మిషన్, టీమ్ ఛార్జర్స్, కవర్ లు ,ప్రింటర్లు,డి. ఎం..ఆఫీసులో పి. డి .సూపర్ వైజర్ నియమించాలని, విజయవాడ బస్సు లకు ఔట్ సోర్సింగ్ బుకింగ్ ఏర్పాటు, భోజనాల శాల ఏర్పాటు చేయాలని ఆ వినతి పత్రంలో కోరారు. (Story : ఆర్టీసీ ఈడికి వినతిపత్రం అందజేసిన ఇ. యు. నాయకులు)