కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రమోద్ కుమార్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా ప్రమోద్ కుమార్ సోమవారం రాత్రి 7 గంటలకు పదవి బాధ్యతను స్వీకరించారు. గతంలో ఉన్న మల్లికార్జున పొద్దుటూరుకు బదిలీ కావడం జరిగింది. వారి స్థానంలో జమ్మలమడుగు కమిషనర్ ప్రమోద్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ధర్మవరం మున్సిపల్ అభివృద్ధికి తనవంతుగా కృషిచేసి, అభివృద్ధి బాటలో నడుపుతారని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తదుపరి మున్సిపల్ సిబ్బంది నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.(Story : కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రమోద్ కుమార్)