Homeవార్తలుతెలంగాణఎల్.ఆర్.ఎస్. పథకం సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలి

ఎల్.ఆర్.ఎస్. పథకం సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలి

ఎల్.ఆర్.ఎస్. పథకం సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలి

-జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి

న్యూస్‌తెలుగు/ కొమరం భీం , ఆసిఫాబాద్ జిల్లా : అనుమతి లేని లే-అవుట్ల భూముల క్రమబద్ధీకరణ కొరకు చేపట్టిన ఎల్. ఆర్. ఎస్. పథకం సర్వేను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లాలోని కాగజ్ నగర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా కలిసి తహసిల్దారులు, మున్సిపల్ కమిషనర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఇరిగేషన్ ఎ.ఈ., మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అనుమతి లేని లే-అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఎల్ ఆర్ ఎస్ పథకం సర్వేలు అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సర్వేను క్షేత్రస్థాయిలో నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తగు శిక్షణ ఇచ్చి చర్యలు తీసుకోవడం జరుగుతుందని క్రమబద్ధీకరణ కోసం అందిన ప్రతి దరఖాస్తులు రికార్డులతో సరి చూసి, క్షేత్రస్థాయిలో భౌగోళిక పరిస్థితిని పరిశీలించి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. (Story : ఎల్.ఆర్.ఎస్. పథకం సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!