గ్రామీణ పేద, మైనారిటీ, క్రీడాకారునికి ప్రశంస..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
న్యూస్తెలుగు/ వినుకొండ : యువ పరుగుల వీరుడు, జాతీయ ,అంతర్జాతీయ పోటీలలో పాల్గొని పలు అవార్డులు పొందిన షేక్ అబ్దుల్లా రానున్న లండన్ మరియు ఒలంపిక్ గేమ్స్ లలో పాల్గొనే ఆర్థిక స్తోమత లేనందున ప్రభుత్వం ద్వారా సాయం పొందే ప్రయత్నంలో తనకు అన్నయ్య లాంటి మార్గదర్శిగా, సలహాకారాలు అందజేస్తున్న వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ఉద్యోగి, గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఎండి. కరీముల్లా తో కలసి తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలవగా, ముఖ్యమంత్రి తన అవార్డులు చూసి ప్రశంసించి ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు.. తనకు సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, రిటైర్డ్ ఉద్యోగి ఎండి కరీముల్లా లకు కృతజ్ఞతలు తెలిపారు..ఇది మైనార్టీ ముస్లిం ల పట్ల ముఖ్యమంత్రి ప్రేమ, ఆప్యాయత స్తితి గతుల పై సానుభూతి ని తెలుపుతున్నాయి. (Story; గ్రామీణ పేద, మైనారిటీ, క్రీడాకారునికి ప్రశంస..)

