వారంలో రెండు రోజులపాటు ఉచిత కంటి పరీక్షలు
డాక్టర్ జి. హరికృష్ణ
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్-అక్షయ ఐ కేర్ సెంటర్ నందు వారంలో ప్రతి సోమ, గురు వారాలలో (2 రోజులు మాత్రమే) పేదలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించబడునని డాక్టర్. హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కంటిపట్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయకూడదని వారు తెలిపారు. అదేవిధంగా కంటి శుక్లం ఆపరేషన్ కూడా చేయబడునని తెలిపారు. చిన్నపిల్లలకు విజన్ తెరిపి ద్వారా కంటి చూపును మెరుగు పరుచుట, చిన్న పిల్లలకు రొటీనోస్కోపుతో కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. (Story : వారంలో రెండు రోజులపాటు ఉచిత కంటి పరీక్షలు)