Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధికి సహకరించండి

ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధికి సహకరించండి

ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధికి సహకరించండి

 బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను కోరిన ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు

న్యూస్ తెలుగు /విశాఖపట్నం సెప్టెంబర్ 29: ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు ఆదివారం.బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షా లను కోరారు. బీసీసీఐ ఆహ్వానం మేరకు బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రారంభోత్సవం, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు. ఇందులో భాగంగానే ఆంధ్ర నుంచి ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు హాజరయ్యారు. దేశీయ క్రికెట్ క్రీడా రంగాన్ని బలోపేతం కోసం బీసీసీఐ తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వారు అభినందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లో కూడా క్రికెట్ అభివృద్ధికి సహకారం అందించాలని, కొత్త స్టేడియం ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులకు విజ్ఞప్తి చేశారు.ఫొటో రైటప్స్ .. బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను కలిసిన ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ , కార్యదర్శి సానా సతీష్ బాబు.(Story:ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధికి సహకరించండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!