Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విశాఖలో మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్”

విశాఖలో మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్”

విశాఖలో మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్”

స్థానిక ప్రజల నుంచి వినతుల స్వీకరణ

న్యూస్‌తెలుగు/ విశాఖపట్నం: విశాఖలో పర్యటిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో “ప్రజాదర్బార్” నిర్వహించారు. మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వంలో దళితుల హత్యలు, దాడులపై సమగ్ర విచారణ జరపాలి

కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు విధానంలో డీఎంఈ, ఏపీవీవీపీ, డీపీహెచ్, ఎన్ హెచ్ఎం విభాగాలలో పనిచేస్తున్న నర్సులను రెగ్యులర్ చేయాలని, వంద శాతం గ్రాస్ జీతం అమలు చేయాలని, పరస్పర అంగీకార బదిలీలు అమలుచేయాలని, బీమా అందించాలని కోరారు. జర్నలిస్టులకు 4 సెంట్లు చొప్పున ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు రూ.10వేల పెన్షన్ సదుపాయం, కరోనాతో మృతి చెందిన వారికి పరిహారం తదితర సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి మండలం కోడూరులో ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో తమ తండ్రికి కేటాయించిన 5.22 ఎకరాల భూమిని వైకాపా అండతో ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని ఎస్.నాగమణి, జి.జయలక్ష్మి కోరారు. డీఎస్సీ 2008 నోటిఫికేషన్ లో ఎంపికై నష్టపోయిన అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని ఏపీ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధుకు విజ్ఞప్తి చేశారు. రష్యాలో వైద్యవిద్య అభ్యసిస్తున్న తమ పిల్లలకు ఎన్టీఆర్ విదేశీ విద్యాదీవెన బీసీ ఓవర్ సీస్ స్కాలర్ షిప్ మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటిందనే నెపంతో గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు కోరారు. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని, గత వైసీపీ ప్రభుత్వంలో దళితుల హత్యలు, దాడులపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ సుధాకర్ అంశం, వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడికత్తి శ్రీను, కిరణ్ కుమార్ హత్య వంటి కేసులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. భర్త చనిపోయిన తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయడంతో పాటు జీవనోపాధి కల్పించాలని విశాఖకు చెందిన గంటిపిల్లి నూకరత్నం విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యాలయానికి పెద్దఎత్తున చేరుకున్న నేతలు, కార్యకర్తలను కలిశారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. (Story : విశాఖలో మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్”)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!