Home వార్తలు తెలంగాణ రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ తో మంత్రి సీతక్క భేటీ

రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ తో మంత్రి సీతక్క భేటీ

0

రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ తో మంత్రి సీతక్క భేటీ

న్యూస్ తెలుగు /హైదరాబాద్, ములుగు : ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022 లో అసెంబ్లీ లో పాస్ చేసిన బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని గవర్నర్ కు, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామ నీటిసరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ, సీతక్క వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సాంకేతికపరమైన చిక్కులతో ఇంతకాలం పెండింగ్లోనే ములుగు మున్సిపాలిటీ బిల్లు, గత ప్రభుత్వ తప్పిదాలతో మున్సిపాలిటీకి ములుగు నోచుకోని లేదన్నారు.తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లులోనే ములుగు మున్సిపాలిటీ అంశాన్ని చేర్చిన గత ప్రభుత్వం అన్నారు.
అదే బిల్లులోజి హెచ్ యం సి చట్టానికి సవరణలు ప్రతిపాదించిన గత ప్రభుత్వం అని,
దీంతో గందరగోళంగా ములుగు మున్సిపాలిటీ బిల్లు అని పేర్కొన్నారు.
సభ్యుల గందరగోళం నడుమ 2022లో బిల్లును పాస్ చేసిన గత ప్రభుత్వం అన్నారు.
న్యాయపరమైన, సాంకేతికపరమైన అంశాల నేపథ్యంలో బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపిన గత గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అని,
దీంతో పెండింగ్ లోనే ములుగు మున్సిపాలిటీ బిల్లుఅని, బిల్లు వివరాలు గవర్నర్ కి అంద చేసి, ములుగు కి మున్సిపాలిటీ హోదా కల్పించే బిల్లు కి ఆమోద ముద్ర వేయాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.మంత్రి వెంట ఖానాపూర్ ఎంఎల్ఏ వేడ్మ బొజ్జు ఉన్నారు. (Story : రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ తో మంత్రి సీతక్క భేటీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version