Home వార్తలు గ్రాన్యూల్స్‌ ఇండియా ‘బ్రెస్ట్‌ హెల్త్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రారంభం

గ్రాన్యూల్స్‌ ఇండియా ‘బ్రెస్ట్‌ హెల్త్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రారంభం

0

గ్రాన్యూల్స్‌ ఇండియా ‘బ్రెస్ట్‌ హెల్త్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రారంభం

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌, ఏఐజి హాస్పిటల్స్‌లో తమ మొబైల్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ యూనిట్‌ను ప్రారంభించింది. ఏషియన్‌ మెడికల్‌ ఫౌండేషన్‌, యుసి బ్రెస్ట్‌ ఫౌండేషన్‌, ఏఐజి హాస్పిటల్స్‌ భాగస్వామ్యంతో గ్రాన్యూల్స్‌ ట్రస్ట్‌ నేతృత్వంలోని ఈ కార్యక్రమం , వెనుకబడిన కమ్యూనిటీలలో క్యాన్సర్‌ గుర్తింపు, చికిత్సను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అత్యాధునిక మొబైల్‌ యూనిట్‌ ‘‘బ్రెస్ట్‌ హెల్త్‌ ఎక్స్‌ప్రెస్‌’’, అవసరమైన కమ్యూనిటీలకు నేరుగా అధునాతన వైద్య సాంకేతికతను తీసుకువస్తుంది. అత్యాధునిక మామోగ్రఫీ మరియు అల్ట్రాసౌండ్‌ సామర్థ్యాలు, అలాగే హిమోగ్లోబిన్‌, రక్త పోటు, గ్లూకోజ్‌ లెవల్స్‌ వంటి అవసరమైన ఆరోగ్య పరీక్షల కోసం తగిన సౌకర్యాలను కలిగి ఉన్న ఈ మొబైల్‌ క్లినిక్‌ సమానమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల పరంగా అతి పెద్ద పురోగతిని సూచిస్తుంది. (Story : గ్రాన్యూల్స్‌ ఇండియా ‘బ్రెస్ట్‌ హెల్త్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రారంభం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version