Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నవరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయండి

నవరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయండి

నవరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయండి

ఆలయ ఈవో వెంకటేశులు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని ప్రముఖ దుర్గమ్మ దేవత ఆలయంలో అక్టోబర్ మూడవ తేదీ నుంచి 12వ తేదీ వరకు పది రోజులు పాటు శ్రీ దుర్గా దేవి నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో బి.ఆర్. వెంకటేశులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు సాయంకాలం విశేష అలంకరణలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ మూడవ తేదీన దుర్గాదేవి అలంకారం, నాలుగవ తేదీ శ్రీ మహాలక్ష్మి, ఐదవ తేదీ రాజరాజేశ్వరి దేవి, ఆరవ తేదీ మీనాక్షి దేవి, ఏడవ తేదీ పార్వతీదేవి, ఎనిమిదవ తేదీ దుర్గామాత,9వ తేదీ సరస్వతీదేవి అలంకారములు ఉండునని తెలిపారు. పదవ తేదీ చండీ హోమం, సాయంకాలం అమ్మవారి గ్రామోత్సవము, 11వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం 12వ తేదీ విజయ దుర్గాదేవి అలంకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున పట్టణ గ్రామీణ ప్రజలందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. (Story : నవరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!