Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నియోజకవర్గానికి ప్రత్యేక మరమగ్గాల పర్యవేక్షణ అధికారి నియామకం

నియోజకవర్గానికి ప్రత్యేక మరమగ్గాల పర్యవేక్షణ అధికారి నియామకం

నియోజకవర్గానికి ప్రత్యేక మరమగ్గాల పర్యవేక్షణ అధికారి నియామకం

డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ తిరుపతి.. రాజారావు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం నియోజకవర్గానికి మరమగ్గాల పర్యవేక్షణ అధికారిగా ఐజయ్య ను నియమిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ తిరుపతి డిప్యూటీ డైరెక్టర్ రాజారావు తెలిపారు. మీరు మాట్లాడుతూ మరమగ్గాలను నిత్యం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, ధర్మవరం ముఖ్య కేంద్రంగా ఐజయ్య ను చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు సవిత ఆదేశాను ప్రకారం నియమించడం జరిగిందని తెలిపారు. వీరు నిరంతరం ధర్మవరం కేంద్రంగా మరమగ్గాలను తనిఖీ చేస్తారని తెలిపారు. పవర్లూమ్స్ సమస్యలు, పవర్ లూమ్స్ రిజర్వేషన్ ఆక్ట్ యొక్క ఉల్లంఘన, వయలేషణ్ గురించి ఐజయ్య సెల్ నెంబర్ కు 7396034586కు సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని చేనేతలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. (Story : నియోజకవర్గానికి ప్రత్యేక మరమగ్గాల పర్యవేక్షణ అధికారి నియామకం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!