ఈ నెల 28 జాతీయ లోక్ ఆదాలత్
ఎస్ వి పి. సూర్య చంద్రకళ
న్యూస్ తెలుగు /ములుగు : జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు ఈ నెల 28 నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని, ములుగు జిల్లా ప్రధాన న్యామూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎస్. వి పి. సూర్య చంద్రకళ తెలిపారు. శనివారం జిల్లా కోర్టు కార్యాలయంలో పోలీస్ అధికారులు,రెవెన్యూ అధికారులు, ఎక్సైజ్ అధికారులు తో సమావేశం నిర్వహించి,ఆమె మాట్లాడుతూ ములుగు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసుల పరిష్కారానికి , ములుగు పోలీస్ అధికారులు, రెవిన్యూ అధికారులు, ఎక్సైజ్ అధికారులు సహకరించాలని తెలిపారు. రాజీ పడదగు కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాజీమార్గం ద్వారా, వారి కేసును పరిష్కరించుకునేలా అందరూ సహాయపడాలని తెలిపారు.లోక్ అదాలత్ పట్ల ఎటువంటి న్యాయ, సలహా సూచనల కొరకు అయిననూ, న్యాయ సేవా అధికార సంస్థలను ఆశ్రయించి, న్యాయ సలహాలు, సూచనలను పొందగలరని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కమ్ కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ములుగు, టి. కన్నయ్య లాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, డి. రామ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ములుగు దివాకరా. టి. ఎస్.ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్. ఆర్. డి. ఓ. ములుగు. సత్య పాల్ రెడ్డి,ఎస్. డి. పి.ఓ. ఎన్. రవీందర్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : ఈ నెల 28 జాతీయ లోక్ ఆదాలత్)