బ్యాంకింగ్ సేవలకు ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రం
ఒకేచోట అందుబాటులో 13 బ్యాంక్ల కౌంటర్లు
జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన
న్యూస్ తెలుగు/విజయవాడ : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకింగ్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన తెలిపారు. బాదితులు ఈ బ్యాంకింగ్ సేవలను సద్వినియోం చేసుకోవాలని సూచించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన బ్యాంకింగ్ సేవల ఫెసిలిటేషన్ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి జే.నివాస్, జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భీమా సేవలకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం విజయవంతం కావటంతో బ్యాంకింగ్ సేవలకు ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందేందుకు, అక్కడికక్కడే దరఖాస్తుల పరిష్కారానికి ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో మొత్తం 13 బ్యాంకులు యూబీఐ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యాక్సిసెన బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీ బ్యాంక్ల ప్రతినిదులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకింగ్ కమిటీ ఏజీఎం శ్రీనివాస్, యుబీఐ డీఆర్ హెడ్ మూర్తి, ఎల్డీఎం ప్రియాంక పాల్గొన్నారు. (Story : బ్యాంకింగ్ సేవలకు ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రం)