స్వచ్ఛతాహి సేవ-2024 విజయవంతానికి ప్రణాళిక
న్యూస్తెలుగు/వినుకొండ : స్వచ్ఛభారత్ మిషన్, స్వచ్ఛంద కార్పొరేషన్ రూపొందించి అమలు చేస్తున్న” స్వభావ స్వచ్ఛత-సంస్కార స్వచ్ఛత”అన్న నినాదంతో స్వచ్ఛతాహి సేవ-2024 కార్యక్రమాన్ని 15 రోజులపాటు పట్టణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈనెల 17వ తేదీ నిర్వహించు మానవహారం, సామూహిక స్వచ్ఛత కార్యక్రమం ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు. ఎస్ హెచ్ ఎస్ 2024 సంబంధించి రోజువారి కార్యక్రమాలను రూపొందించమన్నారు.17వ తేదీ ఉదయం 9 గంటలకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు గౌరవ ఎమ్మెల్యే , చైర్మన్ దస్తగిరి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అక్కడ మానవహారంగా ఏర్పడి సామూహిక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.18వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీనివాస్ నగర్ ఇంద్రానగర్ ప్రాంతాలలో దోమల వృద్ధి కేంద్రాల ప్రక్షాళన కార్యక్రమం,ఉదయం 10 గంటలకు ఎన్ ఎస్ పి కాలనీ సాయిబాబా గుడి నుండి శివయ్య స్తూపం వరకు “స్వచ్ఛత వాక్”,మధ్యాహ్నం రెండున్నర గంటలకు మున్సిపల్ ఆఫీసు నందు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.19వ తేదీ ఉదయం 9 గంటలకు మున్సిపల్ ఆఫీస్ నందు స్వచ్ఛత ప్రతిజ్ఞ,మధ్యాహ్నం మూడు గంటలకు మున్సిపల్ ఆఫీస్ కౌన్సిల్ నందు ప్రభుత్వ పథకాలను సద్వినియోగ పరుచుకునేలా లబ్ధిదారులైన పారిశుధ్య కార్మికులను గుర్తించు కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.20వ తేదీ ఉదయం 9 గంటలకు మున్సిపల్ పార్కు వద్ద “ఏక్ పేడ్ మా కీ నామ్ “నినాదంతో మొక్కలు నాటడం కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.21వ తేదీ ఉదయం 8 గంటలకు మున్సిపల్ పార్కు నందు పరిశుభ్రత కార్యక్రమం ,ఉదయం 9 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వరకు మెప్మా సిబ్బంది మరియు స్వచ్చంద సంస్థల ద్వారా పరిశుభ్రత కార్యక్రమం ,మధ్యాహ్నం రెండున్నర గంటలకు పారిశుద్ధ్య కార్మికులకు పి పి ఇ కిట్స్ అందజేస్తామని చెప్పారు.22వ తేదీ ఉదయం ఐదున్నర గంటలకు మున్సిపల్ కార్యాలయం నందు “మిషన్ లైఫ్ క్యాంపెయిన్ “గూర్చి పారిశుధ్య కార్మికులకు అవగాహనా కార్యక్రమం ,ఉదయం ఎనిమిది గంటలకు ఎన్ ఎస్ పి కాలనీ సాయిబాబా గుడి వద్ద కాలువల పూడికతీత ,పదిన్నర గంటలకు జాషువా కళా ప్రాంగణంలో పారిశుధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యపరీక్షలు జరుపుతామన్నారు.23వ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు శివయ్య స్తూపం నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు రహదారుల పరిశుభ్రత,9 గంటలకు విష్ణుకుండి నగర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిశీలనా మరియు పర్యవేక్షణ కార్యక్రమం జరుపుతామన్నారు.24వ తేదీ 9 గంటలకు సింగర చెరువు ఫిల్టర్ బెడ్స్ వద్ద తాగునీటి నిర్వహణ శుభ్రత ,10 గంటలకు తాగునీటి నమూనాల పరీక్షలు మరియు క్లోరినేషన్ కార్యక్రమము ,పదిన్నర గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు సఫాయి కార్మికులు,వారి కుటుంబ సభ్యులకు భద్రత మరియు వ్యక్తిగత రక్షణలపై అవగాహన కార్యక్రమం జరుపుతామన్నారు.25వ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు వాణిజ్య మరియు వ్యాపార ప్రదేశాలలో పరిశుభ్రత కార్యక్రమం,ఉదయం 10:30 గంటలకు జాషువా కళా ప్రాంగణం నందు పరిశుభ్రతపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.26వ తేదీ ఉదయం ఐదున్నర గంటలకు జాషువా కళా ప్రాంగణం నందు సైబర్ స్వచ్ఛత మరియు డిజిటల్ స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం,మధ్యాహ్నం రెండున్నర గంటలకు జాషువా కళా ప్రాంగణం నందు పిల్లల సంరక్షణ సహాయ కార్యక్రమాలు మరియు విద్యా ప్రోత్సహిక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నారు.27వ తేదీ ఉదయం 9 గంటలకు అన్ని సచివాలయాలలో వార్డు సభలు నిర్వహించి ,మధ్యాహ్నం నాలుగు గంటలకు ఎన్ ఎస్ పి కాలనీ ఐ లవ్ వినుకొండ పాయింట్ వద్ద సుందరీకరణ మరియు సెల్ఫీ పాయింట్ ఏర్పాటు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.28వ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు ఫ్యాన్సీ సెంటర్ నుండి మెయిన్ బజార్ వరకు రహదారుల పరిశుభ్రత, పునరువినియోగ వస్తువుల సేకరణ కార్యక్రమం,ఉదయం 9 గంటలకు కారంపూడి రోడ్డు ఐ.ఎస్.డబ్ల్యు.ఎం., ఎఫ్.ఎస్.టి.పి.ప్లాంట్ గోడలపై స్వచ్ఛత చిత్రాలు వేయుటపై అవగాహన కార్యక్రమం,మధ్యాహ్నం రెండున్నర గంటలకు జాషువా కళా ప్రాంగణం నందు రోగ నివారణ టీకా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.29వ తేదీ ఉదయం 9 గంటలకు మున్సిపల్ కార్యాలయం నందు ఔత్సాహిక విద్యార్థులకు “వేస్ట్ టు ఆర్ట్” అన్న ఇతురుత్తంపై ఎగ్జిబిషన్-కాంపిటీషన్స్,మధ్యాహ్నం రెండున్నర గంటలకు జాషువా కళా ప్రాంగణం నందు ఆరోగ్య భీమా నమోదు సహాయ కార్యక్రమం భీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.30వ తేదీ ఉదయం 8:30 గంటలకు విష్ణుకుండి నగర్ రామాలయం గుడి వద్ద చెత్త వర్గీకరణ-చెత్త పునర్వినియోగ నైపుణ్యత పై అవగాహన కార్యక్రమం,ఉదయం 9:30 గంటలకు శివయ్య స్తూపం సెంటర్ నందు వీధి వ్యాపారస్తులకు చెత్త నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.అక్టోబర్ ఒకటో తేదీన ఉదయం 9 గంటలకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు పారిశుద్ధ్యం పరిశుభ్రత సమస్యలపై పరిష్కారములకు “స్వచ్ఛ హ్యాకథాన్స్” కార్యక్రమం,మధ్యాహ్నం మూడున్నర గంటలకు సురేష్ మహల్ పబ్లిక్ టాయిలెట్ పరిశీలన కార్యక్రమం,సాయంత్రం ఐదు గంటలకు జాషువా కళా ప్రాంగణమునందు సన్మాన కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిర్వహించదమన్నారు.ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రజలు, ప్రజాప్రతినిధులు,స్వచ్చంధ సంస్థలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. (Story : స్వచ్ఛతాహి సేవ-2024 విజయవంతానికి ప్రణాళిక)