Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్వచ్ఛత హి సేవలో అందరూ భాగస్వాములు కండి

స్వచ్ఛత హి సేవలో అందరూ భాగస్వాములు కండి

స్వచ్ఛత హి సేవలో అందరూ భాగస్వాములు కండి

నగరపాలక సంస్థ కమిషనర్‌ హెచ్‌ఎం.ధ్యానచంద్ర

న్యూస్‌తెలుగు/విజయవాడ కార్పొరేషన్‌ : స్వచ్ఛత హి సేవలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ హెచ్‌ఎం.ధ్యానచంద్ర నగర పౌరులకు పిలుపునిచ్చారు. స్థానిక మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈనెల 17న జరిగే స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను కమిషనర్‌ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ ఆశయంతో స్వచ్ఛ భారత్‌ మిషన్‌గా 2014లో మొదలైన స్వచ్ఛభారత్‌ 2024కి పది సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈ ఏడు జరిగే స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో నగర పౌరులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొనాలని స్వచ్ఛ విజయవాడలో భాగస్వాములు కావాలన్నారు. స్వచ్ఛత హి సేవ ప్రారంభోత్సవ కార్యక్రమం మాకు నేని బసవపూర్ణయ్య స్టేడియంలో మంగళవారం ఉదయం 7.30 గంటలకు మొదలవుతుందని తెలిపారు. ప్రజలందరూ తరలివచ్చి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ కేవి.సత్యవతి, డిప్యూటీ సిటీ ప్లానర్‌ జూబిన్‌ చీరన్‌రాయ్‌ పాల్గొన్నారు. (Story : స్వచ్ఛత హి సేవలో అందరూ భాగస్వాములు కండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics