బీసీలకు 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో
జి. ఓ విడుదల చేయాలి
న్యూస్తెలుగు/వనపర్తి : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో జి. ఓ విడుదల చేయాలని BCF రాష్ట్ర కన్వీనర్ నాగనమోని చెన్న రాములు ముదిరాజ్, BCF రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ ఎన్.నాగమ్మ డిమాండ్ చేశారు. బి.సి.ఫెడరేషన్ ( BCF ) జిల్లా కమిటీ సమావేశం గుంటి కురుమూర్తి అధ్యక్షతన ఒక ప్రైవేట్ హాలులో జరిగింది . ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా BCF రాష్ట్ర కన్వీనర్ నాగనమోని చెన్న రాములు ముదిరాజ్ గారు , BCF రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ ఎన్.నాగమ్మ హాజరైనారు . నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ గారు ప్రసంగిస్తూ సమగ్ర కుల గణన చేపట్టి , కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో జి. ఓ విడుదల చేసిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రతి మండలంలో బీసీలకు విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక బి.సి. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని, భూమిలేని బీసీలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టబద్ధమైన కమిషన్ వేయాలని, బిసి మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలని, కులవృత్తులకు చేయూతనిచ్చి సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలి , బి.సి.లకు ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలు చేయాలి,బి.సి.అట్రాసిటీ చట్టం రూపొందించి పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ఐ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని, బీసీలు రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడి సాధించాలని మహాత్మా ఫూలే ఆశయాల కోసం గులాం గిరి చేయకుండా స్వతంత్రంగా జీవించాలని సూచించారు .మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎన్. నాగమ్మ ప్రసంగిస్తూ భారతదేశంలో బీసీలు వెనుకబడటం వల్ల దారిద్రరేఖకు దిగువన జీవిస్తూ దీనంగా ఉన్నారని బీసీ మహిళలు అనేక రకాలైన బాధలను అనుభవిస్తున్నారని మహిళా విముక్తి కోసం బి సి ఎఫ్ లో మహిళలు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా నలుమూలల నుండి అన్ని మండలాల ప్రతినిధులు హాజరై నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా గుంటి కురుమూర్తి ముదిరాజ్ , ప్రధాన కార్యదర్శిగా తిరుపతయ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా జానంపేట లీలావతి, బాలస్వామి రజక , మాజీ ఎంపిటిసి మిద్దె కృష్ణ జిల్లా కోశాధికారిగా ఎస్. చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శులుగా వాకిటి రాజమౌళి పిల్లుట్ల అవినాష్ ,బోలెద్దుల కృష్ణ మరియు జాగర్ల కాసిం, జిల్లా కమిటీ సభ్యులుగా ఉందేకోటి అంజి, మహేష్ యాదవ్ బండలయ్య , సుధాకర్,విజయ్ కుమార్ , ఆత్మకూరు అంజి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్ చెన్నరాములు ముదిరాజ్ , ఎన్ నాగమ్మ ,కే.వెంకటేశ్వర్లు జి రవికుమార్, పి. ప్రతాప్ , గన్నోజు రవికుమార్, మన్సోజు శ్రీనివాసులు బోలె మౌని ధర్గేష్ , తోట బాలరాజు , రమేష్ సాగర్ , పుల్లరి వెంకటస్వామి, ఎన్ సుభాష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు (Story : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో జి. ఓ విడుదల చేయాలి)