పైడితల్లమ్మ దేవాలయంలో చండీ హోమం
న్యూస్తెలుగు/ విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వనంగుడి లో గురువారం మూల నక్షత్రము అమ్మవారి జన్మనక్షత్రం పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థంచండీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ వేదపండితులు తాతా రాజేష్ శర్మ, సాయికిరణ్ శర్మ లు ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం,కలశారాధన, సోమాలి కార్యక్రమాలు నిర్వహించారు.32మందిదంపతులు పాల్గొన్నారు.హోమానంతరం దేవస్థానం ఇఓ డివివి ప్రసాదరావు ఈకార్యక్రమంలో పాల్గొన్న దంపతులను కండువాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు.దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. (Story : పైడితల్లమ్మ దేవాలయంలో చండీ హోమం)