ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
మంగళవారం ప్రజావాణి నిర్వహించబడదు
జిల్లాలోని అర్జీదారులు ప్రజావాణి మార్పును గమనించాలి
న్యూస్ తెలుగు /ములుగు : హైదరాబాద్ మహాత్మా బాపు రావు పూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సోమవారం ఓక ప్రకటన లో తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశాలు జరుగుతున్నందున మంగళవారం నాడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్టు కలెక్టర్ తెలిపారు.ఈ మార్పును ములుగు జిల్లా వాసులు గమనించి, అర్జీదారులు బుధవారం నాడు హైదరాబాదు లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ అట్టి ప్రకటనలో తెలిపారు. (Story : ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా)
