Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్:

విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్:

0

విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్:

వైద్య సేవలు, సరఫరా పరిస్థితులను సమీక్షించి, సహాయం భరోసా.
న్యూస్ తెలుగు ధర్మవరం: (శ్రీ సత్య సాయి జిల్లా)విజయవాడలో వరద ప్రభావిత కండ్రిక ప్రాంతాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమీక్షించారు. మంత్రి సత్య కుమార్ యాదవ్, ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను సందర్శించి, అక్కడ అందించబడుతున్న వసతులు, మందుల పరిస్థితులను సవివరంగా పరిశీలించారు.మంత్రి, వరద బాధిత కుటుంబాలకు మెడికల్ కిట్లు, దుప్పట్లు అందిస్తూ, భోజనం ఏర్పాట్లను కూడా సమీక్షించారు. వైద్యసేవలు సక్రమంగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకొని, ప్రజలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.అలాగే, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని వైద్యసిబ్బందికి సూచించారు. మంత్రి సత్య కుమార్ యాదవ్, సంబంధిత అధికారులు, వైద్యసిబ్బంది అందరూ సంయమనంతో సేవలు అందించాల్సిన అవసరం ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.(Story:విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version