Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌జాబ్ మేళాకు 77 మంది విద్యార్థులు ఎంపిక

జాబ్ మేళాకు 77 మంది విద్యార్థులు ఎంపిక

జాబ్ మేళాకు 77 మంది విద్యార్థులు ఎంపిక

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా): ధ‌ర్మ‌వ‌రం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఎంప్లాయిమెంట్ షీట్ ఆఫ్ సంయుక్త ఆధ్వర్యంలో, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహకారంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా జాబ్ మేళాను నిర్వహించినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎన్. బాలస్వామి, నైపుణ్యాభివృద్ధి ప్లేస్మెంట్ అధికారి కె తేజ్ కుమార్, సిడాప్- డిపిటిఎమ్ నారాయణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 5 కంపెనీ ప్రతినిధులు హాజరు కావడం జరిగిందని, 188 మంది జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరు కావడం జరిగిందని తెలిపారు. ఇంటర్వ్యూలో 77 మంది వివిధ కంపెనీలకు ఎంపిక కావడం పట్ల కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో ధర్మవరం బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్, మంత్రి ముఖ్య అనుచరులు హరీష్ పాల్గొని, ఈ జాబ్ మేళా యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ జాబ్ మేళా ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది అని తెలిపారు. నిరుద్యోగులకు ఐదు కంపెనీ ప్రతినిధులు ముందుకు రావడం వారి భవిష్యత్తుకు పునాది వేయడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడాప్ సిబ్బంది, ఎంప్లాయిమెంట్ అధికారులు, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి .చెర్లోపల్లి నారాయణస్వామి, జింక చంద్రశేఖర్, సాయి, షాకే ఓబులేష్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story: జాబ్ మేళాకు 77 మంది విద్యార్థులు ఎంపిక)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!