Home వార్తలు వివో ఇమాజిన్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్రఫీ అవార్డ్స్‌కు ఎంట్రీలు ఆహ్వానం

వివో ఇమాజిన్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్రఫీ అవార్డ్స్‌కు ఎంట్రీలు ఆహ్వానం

0

వివో ఇమాజిన్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్రఫీ అవార్డ్స్‌కు ఎంట్రీలు ఆహ్వానం

న్యూస్‌తెలుగు /ముంబయి: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్లోబల్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వివో ఇమాజిన్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఫోటోగ్రఫీ అవార్డ్స్‌ రెండో ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ప్రముఖ రచయిత, ఫిల్మ్‌ మేకర్‌ జోయా అక్తర్‌ నేతృత్వంలోని జ్యూరీలో ఫొటోగ్రఫీ దిగ్గజాలు వినీత్‌ వోహ్రా, రాకేశ్‌ పులపా, అమీర్‌ వనీ ఉన్నారు. నేచర్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌, ఆర్కిటెక్చర్‌, పోర్ట్రెయిట్స్‌, నైట్‌ అండ్‌ లైట్‌, మోషన్‌, స్ట్రీట్‌ ఫోటోగ్రఫీ అనే ఆరు ఆకర్షణీయమైన, విభిన్నమైన కేటగిరీలను ఈ అవార్డులు అందిస్తాయి. ఎంట్రీలు సెప్టెంబర్‌ 8తో ముగియనుండటంతో జ్యూరీ 30 మంది ఫైనలిస్టులను ఎంపిక చేయనుంది. ఈ ఫైనలిస్టులు ఉత్తేజకరమైన సవాలును ఎదుర్కొంటారు. తుది మూల్యాంకనం కోసం వారి పనిని సమర్పించే అవకాశం ఉంటుంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్లు, జ్యూరీ సభ్యులు వినీత్‌ వోహ్రా, రాకేశ్‌ పులపా, అమీర్‌ వనీల నేతృత్వంలో జరిగే ఫొటోగ్రఫీ మాస్టర్‌ క్లాస్‌ లకు హాజరై తమ ఫొటోగ్రఫీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు. గ్రాండ్‌ ప్రైజ్‌ విజేతకు రూ.5 లక్షల నగదు బహుమతి, ఆరుగురు కేటగిరీ విజేతలకు ముంబైలో జరిగే గ్రాండ్‌ ఫినాలే ఈవెంట్‌లో ఒక్కొక్కరికి వివో ఎక్స్‌ 100 ప్రో బహుమతి లభిస్తుంది. పాల్గొనేవారు తమ ఎంట్రీలను అధికారిక వివో వెబ్‌సైట్‌ ద్వారా ఆగస్టు 19 నుండి ప్రాథమిక వివరాలను అందజేస్తారు. (Story : వివో ఇమాజిన్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్రఫీ అవార్డ్స్‌కు ఎంట్రీలు ఆహ్వానం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version