Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వన్ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన ఎస్ శ్రీనివాస్

వన్ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన ఎస్ శ్రీనివాస్

0

వన్ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన ఎస్ శ్రీనివాస్

న్యూస్‌తెలుగు/విజయనగరం :  ఇటీవల బదిలీల్లో భాగంగా బుధవారం వన్ టౌన్ సిఐ గా ఎస్ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు.జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ని మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. తమ పరిధిలో ఉన్న కళాశాలలకు, పాఠశాలలకు వెళ్లి మాదకద్రవ్యాల పై అవగాహన కల్పిస్తామన్నారు. రాత్రిపూట గస్తీని పెంచి దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గంజాయిని నిరోధించడంలో భాగంగా ప్రతిరోజు వాహనాల తనిఖీ చేపట్టనున్న మన్నారు. (Story : వన్ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన ఎస్ శ్రీనివాస్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version