‘మిస్టరీ ఆఫ్ ది మిస్సింగ్ జ్యువెల్స్’కు ఆదరణ
న్యూస్తెలుగు/ హైదరాబాద్: ‘పుస్తకం’ నిజంగా జ్ఞాన భాండాగారమే. పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు పుస్తక పఠనం తగ్గింది. ఎక్కువగా చరవాణితోనే కాలం గడుపుతున్నారు. దీంతో సృజనాత్మకత లోపిస్తుంది. పుస్తకాలు చదవడం ద్వారా సృజనాత్మకత పెరుగుతుంది. అక్కడక్కడ పిల్లలు పుస్తకాలు చదువుతున్నారు అనడానికి ఈ బుడ్డోడే నిదర్శనం. పదేళ్ల వయస్సులో ‘మిస్టరీ ఆఫ్ ది మిస్సింగ్ జ్యువెల్స్’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ బుడ్డోడి పేరు దైవిక్. హైదరాబాద్ తెల్లాపూర్లోని మంథన్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నారు. ఈ పుస్తకం బ్రిబుక్స్లో లిస్ట్ చేశారు. ఇంతకీ కథ ఏమిటంటే.. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యం ఆభరణాలు తయారు చేయడంలో ప్రసిద్ధి చెందినది. ఒక దొంగ ఆభరణాలను దొంగిలిస్తాడు. ఆ ఆభరణాల మిస్టరీని యువరాజు ఎలా చేదించాడన్నదే కథ. ఈ పుస్తకం విడుదల అయినప్పటి నుంచి అనేక మంది పుస్తక ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. (Story : ‘మిస్టరీ ఆఫ్ ది మిస్సింగ్ జ్యువెల్స్’కు ఆదరణ)