ఎస్పీ రావుల గిరిధర్ ను సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యులు
న్యూస్తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా ఎస్పీగా ఇటీవలే నూతన బాధ్యతలు చేపట్టిన రావుల గిరిధర్ ను గురువారం జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో షాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఎస్పీ రావుల గిరిధర్ కు ప్రెస్ క్లబ్ సభ్యులు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అదేవిధంగా సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి లాంటి మత్తు పదార్థాలను కూకటి వేళ్ళతో నిర్మూలించాలన్నారు. అందుకు జర్నలిస్టు లు ఇందులో భాగస్వా ములు కావాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షులు అంబటి స్వామి, గౌరవ సలహాదారులు డాక్టర్ సురేష్ శెట్టి, ప్రధాన కార్యదర్శి పి పవన్ కుమార్, కోశాధికారి రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు డి రవిప్రసాద్,కె. ఆంజనేయులు, కె హుస్సేన్, కార్యదర్శి కె శేఖర్, విష్ణు, ప్రవీణ్ కుమార్, బాలరాజు తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. (Story : ఎస్పీ రావుల గిరిధర్ ను సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యులు)