Homeవార్తలుపాన్‌ ఇండియన్‌ స్టార్స్‌తో మెరిసిన ‘ఐఐఎఫ్‌ఏ ఉత్సవం

పాన్‌ ఇండియన్‌ స్టార్స్‌తో మెరిసిన ‘ఐఐఎఫ్‌ఏ ఉత్సవం

పాన్‌ ఇండియన్‌ స్టార్స్‌తో మెరిసిన ‘ఐఐఎఫ్‌ఏ ఉత్సవం

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: సౌత్‌ ఇండియన్‌ సినిమా సాధించిన విజయోత్సవ సంబరాలను చేసుకుంటూ, దక్షిణాది గొప్పతనాన్ని హైలైట్‌ చేస్తూ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలు సంయుక్తంగా ఐఐఎఫ్‌ఏ ఉత్సవం 2024ను యూఏఈ-అబుదాబిలోని యాస్‌ ద్వీపంలో సెప్టెంబర్‌లో అంగరంగవైభవంగా జరపనుంది. యూఏఈ టోలరెన్స్‌ అండ్‌ ఎగ్జిస్టెన్స్‌ మంత్రి షేక్‌ నహ్యాన్‌ బిన్‌ ముబారక్‌ ఏఐ నహ్యాన్‌ సమక్షంలో, అబుదాబి, మిరల్‌ల డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ టూరిజంతో భాగస్వామ్యంతో సౌత్‌ ఇండియన్‌ సినిమా సగర్వంగా తన ప్రశస్తిని చాటుకోనుంది. ఐఐఎఫ్‌ఏ ఉత్సవం అంతర్జాతీయ వేడుకలు అత్యంత వైభవంగా అధికారిక భారతదేశంతో ప్రారంభమైనందున దాని అంచనాలు మరింత అపూర్వమైన స్థాయికి పెరిగాయి. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో ఐఐఎఫ్‌ఏ ఉత్సవం సంబంధించిన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. హోస్ట్‌లు, సదరన్‌ సినిమా పయనీర్స్‌, ఇండస్ట్రీ లీడర్‌లు, అంతర్జాతీయంగా ఆర్టిస్టులు, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, ముఖ్య మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. స్టార్స్‌ రానా దగ్గుబాటి, రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్‌, తేజ సజ్జా, రాశి ఖన్నా, శ్రీలీల తదితరులు పాల్గొన్నారు. (Story : పాన్‌ ఇండియన్‌ స్టార్స్‌తో మెరిసిన ‘ఐఐఎఫ్‌ఏ ఉత్సవం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!