ఒప్పో రెనో12 5జీ సిరీస్ విడుదల
న్యూస్తెలుగు/న్యూఢిల్లీ:ఒప్పో ఇండియా తాజాగా రెనో12 సిరీస్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో ఏఐ ఫోన్ల లభ్యతను వేగవంతం చేసే దిశగా తొలి అడుగు వేసింది. రెనో12 సిరీస్- ‘‘నిత్యం మీకు తోడుండే ఏఐ’’- ఇది క్లిష్టమైన ఇమేజ్లను ఎడిటింగ్ లేకుండా ఫన్నీ ఫోటోలను అందించేందుకు ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ క్లియర్ ఫేస్, ఏఐ బెస్ట్ ఫేస్, స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ పరికరాలు రోజువారీ ఉత్పాదకతను పెంచడానికి ఏఐ రైటర్, ఏఐ సమ్మరీ, ఏఐ స్పీక్లను కలిగి ఉన్న గూగుల్ జెమిని ఎల్ఎల్ఎం ఆధారితమైన ఏఐ టూల్బాక్స్ను కూడా కలిగి ఉంటుంది. రెనో12 ప్రో 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 12జీబీG256జీబీ మోడల్కు రూ.36,999, 12జీబీG512జీబీ వెర్షన్ కోసం రూ.40,999. రెనో12 5జీ ధర రూ.32,999, 8జీబీ ర్యామ్, 256జీబీ నిల్వతో వస్తుంది. రెనో12 ప్రో 5జీ భారతదేశంలో జూలై 18 నుంచి విక్రయాలకు అందుబాటులోకి వస్తుంది. (Story :ఒప్పో రెనో12 5జీ సిరీస్ విడుదల)