Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

0

వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

న్యూ తెలుగు/ధర్మవరం(శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని యాదవ వీధిలో కోటగడ్డ వాల్మీకి మహర్షి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా అర్చకుల యొక్క వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, నవగ్రహ పూజ, కలశారాధనను నిర్వహించారు. తదుపరి గణపతి, నవగ్రహ, వాల్మీకి హోమం సాంప్రదాయ పద్ధతిలో అర్చకులు నిర్వహించారు. తదుపరి భక్తాయులకు అన్నప్రసాద కార్యక్రమము కూడా నిర్వహించినట్లు కమిటీ వారు తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్టకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.(Story:వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version