ప్రైవేట్ స్కూళ్ల పై చర్యలు
న్యూస్తెలుగు/విజయనగరం: విజయనగరం జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలు మినహా ఇతర పుస్తకాలు విక్రయిస్తే ఆయా పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి 5 శాతం రుసుము చెల్లించి నిర్దేశించిన విక్రయశాలల్లో కొనుగోలు చేసిన పుస్తకాలను మినహా మరే పుస్తకాలు విద్యార్థులకు కొనుగోలు చేయాలని సిఫారసు చేయరాదని స్పష్టం చేశారు. (Story: ప్రైవేట్ స్కూళ్ల పై చర్యలు)