Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌3 ల‌క్ష‌ల‌కు 15 ల‌క్ష‌ల దొంగ‌నోట్లు!

3 ల‌క్ష‌ల‌కు 15 ల‌క్ష‌ల దొంగ‌నోట్లు!

3 ల‌క్ష‌ల‌కు 15 ల‌క్ష‌ల దొంగ‌నోట్లు!

జైలులో ప‌రిచ‌యం దొంగ‌ల‌ను క‌లిపింది
విజయనగరంలో దొంగనోట్లు చలామణీకి పాల్చడిన ఇద్దరు అరెస్టు

విజ‌య‌న‌గ‌రం క్రైమ్‌ (న్యూస్ తెలుగు) : దొంగనోట్లు చలామణీకి పాల్ప‌డిన ఇద్దరు వ్య‌క్తులు విజ‌య‌న‌గ‌రంలో ప‌ట్టుబ‌డ్డారు. విజయనగరం పట్టణం గుమ్చి ప్రాంతంలో దొంగనోట్లు చలామణీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ. 15 లక్షలు విలువైన దొంగనోట్లును స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషనులో మార్చి 2న నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు వెల్లడించారు.

విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ – విజయనగరం 2వ పట్టణ సిఐ కోరాడ రామారావుకు అందిన‌ పక్కా సమాచారం మేర‌కు 2వ పట్టణ ఎస్ఐ ఐ.దుర్గా ప్రసాద్, సిబ్బందితో విజయనగరం పట్టణం గుమ్చి ప్రాంతానికి చేరుకొని, అక్కడ అనుమానస్పదంగా సంచరిస్తున్న (ఎ-1) విజయనగరం వై.ఎస్.ఆర్.నగర్ కు చెందిన బంగారి చక్రధర్ అలియాస్ చక్రి (36 సం.లు) (ఎ-2) దత్తిరాజేరు మండలం గడసం గ్రామానికి చెందిన చంద్రమణిపాల్ (33 సం.లు) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ. 25 వేలు చొప్పున నకిలీ కరెన్సీ రూ.500ల నోట్లును స్వాధీనం చేసుకున్నారన్నారు. నోట్లును పరిశీలించి, వారిని విచారణ చేయగా, తమకు ఈ నకిలీ నోట్లును చలామణీ చేసేందుకుగాను (ఎ-3) ఒడిస్సా రాష్ట్రం జాపూర్ జిల్లా చెంచునార గ్రామానికి చెందినచంద్రమణిపాల్ అనే వ్యక్తి విజయనగరం రైల్వే స్టేషను వద్ద రూ.15,50,000ల విలువైన నకిలీ రూ.500/- ల కరెన్సీ నోట్లు ఇచ్చినట్లు, అందుకు ప్రతిగా తాము రూ.3 లక్షల ఒరిజినల్ నోట్లును (ఎ-3) చంద్రమణిపాల్ కు చెల్లించినట్లుగా అంగీకరించారన్నారు.
నిందితులను మరింత లోతుగా విచారణ చేయగా (ఎ-1) బంగారి చక్రధర్ పై ఇప్పటికే విజయనగరం 1వపట్టణ పోలీసు స్టేషనులో రెండు రేప్ కేసులు ఉన్నాయని, అతడిపై రౌడీ షీటు కూడా ఉందన్నారు. (ఎ-1) బంగారి చక్రధర్ విజయనగరం సబ్ జైలులో రిమాండులో ఉండే సమయంలో గజపతినగరం కేసులో అరెస్టు అయిన ఒడిస్సాకు చెందిన (ఎ-3) చంద్రమణిపాల్ పరిచయం అయినట్లు, తాను దొంగనోట్లును చలామణీ చేస్తుంటానని, దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన (ఎ-2) రాజాన విష్ణు అనే వ్యక్తికి కూడా తానే దొంగనోట్లును సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారన్నారు. అప్పటి నుండి వారితో స్నేహం కొనసాగిస్తూ వస్తున్నట్లుగా నిందితులు అంగీకరించారని విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న (ఎ-3) చంద్రమణిపాల్ ను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించామని, అతడిని పట్టుకొంటే దొంగనోట్లు ముద్రణ ఎవరు చేస్తున్నది? ఎక్కడ చేస్తున్నది? ఈ నేరంలో ఇంకెవరైనా పాత్రధారులు ఉన్నారా? అన్న విషయాలు వెల్లడవుతాయన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన 2వ పట్టణ సిఐ కోరాడ రామారావు, ఎస్ఐ ఐ.దుర్గా ప్రసాద్, ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించినట్లుగా తెలిపారు. (Story: 3 ల‌క్ష‌ల‌కు 15 ల‌క్ష‌ల దొంగ‌నోట్లు!)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!