Home టాప్‌స్టోరీ అడవిని దత్తత తీసుకున్న నాగార్జున

అడవిని దత్తత తీసుకున్న నాగార్జున

0
Nagarjuna adopts the forest

అడవిని దత్తత తీసుకున్న నాగార్జున
హైదరాబాద్‌ : సినీ నటుడు, ‘కింగ్‌’ అక్కినేని నాగార్జున తెలంగాణ రాష్ట్రంలో ఒక అడవిని దత్తత తీసుకున్నారు. తెలంగాణలో 1,000 ఎకరాల రిజర్వ్‌ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటున్నట్లు అక్కినేని నాగార్జున గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గురువారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జన్మదినోత్సవం సందర్భంగా, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మేడ్చల్‌ జిల్లా చెంగిచెర్లలో అడవిని నాగార్జున దత్తత తీసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు అర్బన్‌ ఫారెస్ట్‌ అని నామకరణం చేశారు. దీని ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున భార్య అక్కినేని అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్‌, సుమంత్‌, సుశాంత్‌, సురేఖ, మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. (Story : అడవిని దత్తత తీసుకున్న నాగార్జున)

See Also : డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version