ధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
చేతకాకపోతే సెలవు పెట్టి వెళ్ళండి
పెబ్బేర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో
MLA మేఘారెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని
అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సెలవు పెట్టి వెళ్ళవచ్చునని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పెబ్బేరు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెబ్బేరు మున్సిపాలిటీలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో MLA పాల్గొని మాట్లాడారు
మరో వారం రోజుల్లో మనం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుందామని అప్పటిలోగా పలు సమస్యలను గుర్తించాలన్నారు
మున్సిపాలిటీలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఎక్కడ పని చేస్తున్నారన్న వివరాలు ఇవ్వాలని కోరారు
అమృత్ స్కీంకు సంబంధించిన చేపట్టిన పనులు వాటి వివరాలను సైతం గుర్తించాలన్నారు
విద్యుత్ స్తంభాలు, సమస్యలు ఉంటే గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని నివేదికలు తయారు చేయాలన్నారు
వేసవి దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇద్దరు ఎక్కడ రాకుండా చేపట్టాల్సిన, పరిష్కరించాల్సిన సమస్యలను సైతం గుర్తించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు
టెండర్లకు సంబంధించి ఎవరెవరు ఏ టెండర్లు వేశారు అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు
మున్సిపాలిటీ టాక్స్ వసూళ్లు అందుకు సంబంధించిన వివరాలు చేద్దాం
రాత్రులు పొద్దు పోయేదాకా నడిపించే హోటళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు
వార్డులలో CC కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నివేదికలు తయారు చేయాలని అందుకు సంబంధించి తాను వ్యక్తిగతంగా ప్రతి వార్డులో ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు
వైండింగ్ సంబంధించిన పనులపై దృష్టి సారించి పూర్తిచేసే విధంగా చూడాలని సూచించారు
పట్టణంలోని 12 వార్డులు అభివృద్ధి సాధించాలని పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, కమిషనర్, పెబ్బేరు మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story L: ధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు )

