జనహృదయనేతకు జననీరాజనం
న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 67వ జన్మదినం అత్యంత కోలాహలంగా,నాయకుల,కార్యకర్తల ,అభిమానుల,శ్రేయోభిలాషుల అభినందనలు శుభాకాంక్షలతో నిరంజన్ రెడ్డి స్వగృహం సందడిగా మారింది. భారీ కాన్వాయ్ తో ఇంటికి చేరుకున్న గౌరవ నిరంజన్ రెడ్డి గారు యువత అధ్యక్షులు సూర్యవంశం.గిరి,చిట్యాల.రాము, సునీల్ వాల్మీకి ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించి సర్వమత ప్రార్థనల నడుమ వేదపండితుల,మతపెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.అభిమాని మోహన్ ఆపిల్ పండ్లతో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందుకున్నారు. పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్ ఆధ్వర్యములో ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నాగవరం గ్రామములో గౌరవ నిరంజన్ రెడ్డి గారు రక్తదాన శిబిరం ప్రారంభించారు. అభిమానులు శ్రేయోభిలాషులు నాయకులు బాణసంచా కాల్చి శాలువాలు, నిలువెత్తు పూలదండలు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమములో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి, జోహెబ్ హుస్సేన్ ఘనపూర్ నాయకులు లక్ష్మారెడ్డి,రాళ్ళ.కృష్ణయ్య,వనపర్తి మండల నాయకులు కె.మాణిక్యం, వెంకట్ రావు, మాధవ్ రెడ్డి,ధర్మా నాయక్,సాయి యాదవ్,పెద్దమందడి నాయకులు రఘుపతి రెడ్డి,వేణు యాదవ్,మోహన్ యాదవ్,సేనాపతి,పెబ్బేరు నాయకులు ఎద్దుల. కరుణశ్రీ,వనం.రాములు,దిలీప్ రెడ్డి,గోపాల్ పేట నాయకుల బాలరాజు, చంద్రశేఖర్,శ్రీనివాస్,కె.భాస్కర్,మతీన్,మాన్య నాయక్ ఎదుల నాయకులు రమేష్,రాజారెడ్డి,అబ్దుల్లా రెవల్లి నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.(Story : జనహృదయనేతకు జననీరాజనం )

