ట్రీ గార్డ్ లు వితరణ
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక జడ్పీ హై స్కూల్, ఎన్ఎస్పి కాలనీ నందు శనివారం 20 వ వార్డు కౌన్సిలర్ నంది నరసింహారావు పాఠశాల ఆవరణ లోని మొక్కలకు 50 ట్రీ గార్డ్ లను అందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు నరసింహారావు ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీడీ ఆర్. రాధా కృష్ణ మూర్తి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం. ఎన్. పద్మజ, ఎలీషా, రాంబాబు ఎలిజబెత్ రాణి, మల్లయ్య, శాంతి , గోవిందు నాయక్, చంద్ర శేఖర్, రామాంజినేయులు, గాయిత్రి, సంధ్య, కోటిరత్నం లు పాల్గొన్నారు.(Story:ట్రీ గార్డ్ లు వితరణ)

