గణేష్ ఉత్సవ కమిటీ 14వ వార్షికోత్సవం
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ స్టేట్ బ్యాంక్ రోడ్ గణేష్ ఉత్సవ కమిటీ 14వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు లడ్డులు వేలంపాట నిర్వహించగా మొదట పెద్ద లడ్డు పట్టణానికి చెందిన పొట్ల రాధాకృష్ణ మూర్తి కుమారుడు అమర శ్రీనివాసరావు 2 లక్షల 52 వేల కు స్వామి వారి లడ్డు కైవసం చేసుకున్నారు. అలానే రెండో లడ్డు మహిళలు కు కేటాయించగా మహిళల విభాగంలో ఈ సంవత్సరం రామడుగు శివలక్ష్మి, 2 లక్షల 50 వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ మహోత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు, ఉమ్మడి గుంటూరు జిల్లా జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొని కమిటీ సభ్యులను భక్తులందరినీ ఎంతో ఆనందపరిచి కార్యక్రమంలో పాల్గొన్నారు.(Story:గణేష్ ఉత్సవ కమిటీ 14వ వార్షికోత్సవం)

