Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్న వినుకొండ వాసి

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్న వినుకొండ వాసి

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్న వినుకొండ వాసి

న్యూస్ తెలుగు/వినుకొండ  : పట్టణానికి చెందిన పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లా తన విజయపరంపర ఖాతాలో మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ న0.30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో జరిగిన 42 కిలో మీటర్ల మారథాన్ పందెంలో, ప్రతీకూల వాతావరణం మరియు అలవాటు లేని ప్రాంతం లో అనారోగ్యం పాలైనా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా భారతదేశం నుండి పాల్గొన్న 80 మంది లో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ వాసి పరుగుల వీరుడు గా పేరొందిన షేక్. అబ్దుల్లా గడ్డ కట్టిన మంచుపై 42 కిలోమీటర్లను 06 గంటలలో పూర్తిచేసిన విషయం విధితమే, అందుకుగాను గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరును చేర్చడం జరిగిందని ఓ ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఈ నెల 29న జరిగే ఎన్ ఈ బి స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగే 24 గంటల పరుగు పందెంలో 210 కిలోమీటర్ల ఏ ఎఫ్ ఐ పరుగు పందెంలో పాల్గొనేందుకు ఇండియా రికార్డు కోసం ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తనకు ఆర్థికంగా సహాయ, సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.(Story : గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్న వినుకొండ వాసి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!