ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో ‘శ్రీ విజేత’ సత్తా: రాష్ట్రస్థాయికి 22 మంది ఎంపిక….
న్యూస్ తెలుగు/వినుకొండ : గుంటూరులో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ సెకండ్ లెవెల్ పోటీల్లో వినుకొండలోని శ్రీ విజేత హైస్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 22 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం మంగళవారం తెలిపింది. జోనల్ స్థాయిలో సీహెచ్. మణీ శ్రీచరణ్ (86వ ర్యాంకు), యు. వెంకటతేజ (129), ఎ. రేష్మా చౌదరి (175), కె. ఆశ్రిత్ (179), ఎ. సౌజన్య (200) ఉత్తమ ర్యాంకులు సాధించారు. విజేతలను పాఠశాల కరస్పాండెంట్ కావూరి సాయికుమార్, డైరెక్టర్ ఆవులమంద బ్రహ్మయ్య ఘనంగా సత్కరించి మొమెంటోలు అందజేశారు. గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలపడమే తమ లక్ష్యమని కరస్పాండెంట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.(Story : ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో ‘శ్రీ విజేత’ సత్తా: రాష్ట్రస్థాయికి 22 మంది ఎంపిక….)

