Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆక్రమణల తొలగింపు: ముమ్మరంగా అధికారుల పరిశీలన

ఆక్రమణల తొలగింపు: ముమ్మరంగా అధికారుల పరిశీలన

0

ఆక్రమణల తొలగింపు: ముమ్మరంగా అధికారుల పరిశీలన

న్యూస్ తెలుగు/వినుకొండ  : పట్టణ అభివృద్ధిలో భాగంగా స్థానిక మార్కాపూర్ రోడ్డులో చేపట్టిన ఆక్రమణల తొలగింపు ప్రక్రియను స్పెషల్ ఆఫీసర్ సిద్ధలింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ కె. శివరామ ప్రసాద్, సీఐ ప్రభాకర్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని, ఈ విషయంలో ఎలాంటి జాప్యం ప్రదర్శించవద్దని అధికారులను కమిషనర్ ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు సమన్వయంతో వ్యవహరించి తొలగింపు పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రజలు కూడా తమ ఆక్రమణలను తొలగించుకుని, పురపాలక సంఘానికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్‌తో పాటు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, రెవెన్యూ, శానిటేషన్ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.(Story : ఆక్రమణల తొలగింపు: ముమ్మరంగా అధికారుల పరిశీలన )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version