వినుకొండలో ఐ ఐ ఎఫ్ ఎల్ నూతన బ్రాంచి ప్రారంభం
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక లాయర్స్ స్ట్రీట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన, ఐ ఐ ఎఫ్ ఎల్ గోల్డ్ ఫైనాన్స్ బ్రాంచ్, గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మి రెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్, మండల కన్వీనర్ దండు చెన్నయ్య, పార్టీ నాయకులు తుమ్మ వెంకటరెడ్డి లు ప్రారంభించారు. జ్యోతి ప్రజలను అనంతరం శాఖలను పలు విభాగాలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ. వేగంగా అభివృద్ధి చెందుతున్న వినుకొండలో ఇలాంటి సంస్థలు రావడం అభినందనీయమన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఐ ఐ ఎఫ్ ఎల్.ఆంధ్రప్రదేశ్ రిజియాన్ హెడ్ ఫణి సూర్య మాట్లాడుతూ. ఇతర కంపెనీలతో పోల్చుకుంటే తమ వద్ద వడ్డీ రేట్లు తక్కువని తక్షణమే లోన్లు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు నిశ్శంకర శ్రీనివాసరావు, ఏరియా మేనేజర్ రాంప్రసాద్, స్థానిక మేనేజర్ ఆల బలారాం, పలువురు రాజకీయ పార్టీల నాయకులతో కలిసి జ్యోతి ప్రచురణ చేశారు. అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.(story : వినుకొండలో ఐ ఐ ఎఫ్ ఎల్ నూతన బ్రాంచి ప్రారంభం )

