పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సి సి లు రిసోర్స్ పర్సన్స్ & సచివాలయ సిబ్బందికి శిక్షణ
న్యూస్ తెలుగు/వినుకొండ : స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మరియు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెనెన్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వినుకొండ మునిసిపాలిటీ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రిసోర్స్ పర్సన్స్, పర్యావరణ కార్యదర్శులు, ప్రజారోగ్య కార్యదర్శులు, మేస్త్రీలు మరియు వివిధ విభాగాలకు చెందిన సచివాలయ సిబ్బందికి వినుకొండ పురపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఒక్కరోజు పూర్తిస్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ షేక్ షకీలా దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ కె. శివ రామ ప్రసాద్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్, మేనేజర్ కె. అర్జున, ఎస్ జి ఎస్ డబ్ల్యూ మేనేజర్ కె. సి హెచ్ వి. రావు, వినుకొండ మునిపాలిటీ శానిటేషన్, వెల్ఫేర్, యమినిటీస్ కార్యదర్శులు మరియు మెప్మా, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఘన వ్యర్థాల నిర్వహణ, మూలంలోనే వ్యర్థాల వేర్పాటు, డోర్-టు-డోర్ వ్యర్థాల సేకరణ, ప్లాస్టిక్ నిర్మూలన, ప్రజల భాగస్వామ్యం, శుభ్రత ప్రమాణాలు మరియు ముఖ్యంగా వినుకొండ నగర ర్యాంకింగ్ మెరుగుపరచడం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వినుకొండ మునిసిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్ మాట్లాడుతూ, ర్యాంకుల పోటీ మాత్రమే కాకుండా,పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్యం మరియు పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచే సమగ్ర కార్యక్రమమని తెలిపారు. ప్రతి కార్యదర్శి, రిసోర్స్ పర్సన్ తమ పరిధిలో చేపట్టే ప్రతి కార్యాచరణ స్వచ్ఛ సర్వేక్షన్ స్కోరింగ్పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వ్యర్థాల వేర్పాటు, డోర్-టు-డోర్ సేకరణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఫీల్డ్ స్థాయి అమలు, సరైన డాక్యుమెంటేషన్ మరియు ప్రజల చైతన్యం వంటి అంశాలను ప్రాధాన్యతతో అమలు చేయాలని సూచించారు. సమష్టి కృషితో స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమ ర్యాంకింగ్ సాధించాల్సిన బాధ్యత అందరిదేనని కమిషనర్ తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుండి శిక్షకులుగా హరీష్ శిక్షణను ప్రారంభించిన ప్రతి ఉద్యోగి తమ సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ, ఉత్తమ ఆచరణలను అనుసరించి విధుల్లో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధనకు, అలాగే స్వచ్ఛ సర్వేక్షన్ లో మెరుగైన ర్యాంకింగ్ సాధించేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శివ పార్వతి, సోషల్ మీడియా హాండిల్ కోఆర్డినేటర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవాడ నుండి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి, ఆర్డిఎంఏ, సిడియమ్యె అధికారులు యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి, స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ – స్వచ్ఛ వినుకొండ లక్ష్య సాధనకు అవసరమైన దిశా నిర్దేశం చేశారు.(Story
: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సి సి లు రిసోర్స్ పర్సన్స్ & సచివాలయ సిబ్బందికి శిక్షణ )

