సాగునీటి సంఘాల సమావేశాన్ని జయప్రదం చేయండి
న్యూస్ తెలుగు/వినుకొండ : నీటి సంరక్షణ- భద్రత- భవిష్యత్తు సాగునీటి సంఘాల పాత్ర అంశంపై ఫిబ్రవరి 5వ తేదీన సాగునీటి సంఘాల అధ్యక్షులతో సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించే సమావేశానికి వినుకొండ నియోజకవర్గం లోని సాగునీటి సంఘాల అధ్యక్షులు అందరూ తప్పనిసరిగా హాజరై జయప్రదం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు బుధవారం కోరారు. నీటి యాజమాన్య పద్ధతులపై దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. గత వైసిపి పాలనలో జరిగిన తప్పిదాలను సరి చేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని అన్నారు. సమావేశానికి నేటి సంఘాల అధ్యక్షులు ప్రతి ఒక్కరు హాజరు కావాలని ఆయన కోరారు.(Story : సాగునీటి సంఘాల సమావేశాన్ని జయప్రదం చేయండి )

