వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పెరుగుతున్న దాడులపై ప్రముఖ న్యాయవాది ని కలిసిన మాజీ ఎమ్మెల్యే బొల్లా
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పెరుగుతున్న దాడులపై ప్రముఖ న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ని కలిసిన పిఎసి మెంబర్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా.హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఏసి సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న దాడులు, ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్న పరిస్థితులు, అలాగే నియోజకవర్గానికి సంబంధించిన అనేక కీలక అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది.(Story : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పెరుగుతున్న దాడులపై ప్రముఖ న్యాయవాది ని కలిసిన మాజీ ఎమ్మెల్యే బొల్లా )

