పెద్ద కంచర్ల, విఠంరాజుపల్లి లో పొలం పిలుస్తోంద
వినుకొండ నియోజకవర్గంలోని పెద్ద కంచర్ల, విఠంరాజుపల్లి గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల వ్యవసాయఅధికారి జీ వరలక్ష్మి మాట్లాడుతూ.. రైతులు రబీ సీజన్ లో వేసిన పంటలు నమోదు చేయించుకావాలని ఖరీఫ్ లో, తాను పండించిన వరి ధాన్యాన్ని రైతు సేవ కేంద్ర సిబ్బంది ద్వారా షెడ్యూలింగ్ చేయించుకొని తేమశాతం 17% ఉన్నట్లయితే ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా కనీస మద్దతు ధరకు అనగా గ్రేడ్ ఏ రకము క్వింటాలు రూ:2389/-, సాధారణ రకం క్వింటాలు రూ:2369,,75 కేజీలు గ్రేడ్ ఏ రకం రూ:1792 సాదారణ రకం 75 కేజీలు: 1777/-, నాణ్యత ప్రమాణం ఉన్నట్లయితే ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించుకోవచ్చని తెలిపారు. తేమ శాతం 17 కంటే అధికంగా ఉన్న ఎడల ఆరబెట్టుకోవాలని ఒకవేళ తేమ శాతం 17 కి మించి ఉన్నట్లయితే 1% కి 1 కిలో తరుగు తో 22% వరకు 5 కిలోల తరుగుతో ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం మద్దతు ధరకు అమ్ముకోవచ్చని అన్నారు.(Story : పెద్ద కంచర్ల, విఠంరాజుపల్లి లో పొలం పిలుస్తోంద )
