అగ్ని బాధిత ఆదివాసి కుటుంబానికి ఆయుర్వేద వైద్యులు జే.కే.సి.టి చైర్మన్ జమాల్ఖాన్ ఇంటినిర్మాణ సామాగ్రి వితరణ
న్యూస్ తెలుగు/ చింతూరు : మండలం లోని పే గ పంచాయతీ లోని వంక గూడెం గ్రామానికి చెందిన కరక ముత్తమ్మ అనే ఆదివాసి మహిళ ఇల్లు గత ఆదివారం అగ్నిప్రమాదానికి గురై కాలిపోయింది.కూలి నాలి చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ముత్తమ్మ భర్త కూడా కాలం చేయటం తో ముగ్గురు పిల్లలను తన కష్టం తో పోషించు కొంటు వచ్చింది. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపద్యం లో అగ్ని ప్రమాద ఘటన జరిగింది.ఆమె పరిస్థితిని గ్రామస్తులు స్థానిక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జే.కే. సి చైర్మన్ జమాల్ఖాన్ దృష్టికి తీసుకు రాగా ఆయన స్పందించి ముత్తమ్మ ఇంటి నిర్మాణానికి కావలసిన సిమెంట్ రేకులు,ఇనుప పైపులను 10 కేజీల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో పి. సాల్మన్ రాజు.రియాజ్, పేగ గ్రామస్తులు కరక ముత్తయ్య,కరక భద్రయ్య పాల్గొన్నారు.(Story :అగ్ని బాధిత ఆదివాసి కుటుంబానికి ఆయుర్వేద వైద్యులు జే.కే.సి.టి చైర్మన్ జమాల్ఖాన్ ఇంటినిర్మాణ సామాగ్రి వితరణ )
