Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మావోయిస్టులు- మాకొద్దు కార్యకలాపాలకు తీవ్ర వ్యతిరేకత తెలిపిన గ్రామ ప్రజలు

మావోయిస్టులు- మాకొద్దు కార్యకలాపాలకు తీవ్ర వ్యతిరేకత తెలిపిన గ్రామ ప్రజలు

0

మావోయిస్టులు- మాకొద్దు కార్యకలాపాలకు తీవ్ర వ్యతిరేకత తెలిపిన గ్రామ ప్రజలు

న్యూస్ తెలుగు /చింతూరు : మాకొద్దు మావోయిస్టులు, మాకొద్దు మావోయిస్టులు అంటూ నినాదాలు చేస్తూ శనివారం చట్టి గ్రామంలోని ప్రజలు, ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు, బంద్ ప్రకటనల వల్ల కలిగే బాధలను వ్యతిరేకించారు. “మావోయిస్టులు మాకు వద్దు” అనే నినాదం మధ్య జరిగిన ఈ నిరసనలో, స్థానికులు తమ ఆగ్రహాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.
ప్రజలు తమ విజ్ఞప్తిలో, “మావోయిస్టులు తమ స్వార్థపూరిత రాజకీయ లక్ష్యాల కోసం,మా ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధికి అడ్డంగా ఉంచా రన్నారు . మావోయిస్టులు తరచూ ఏదో ఒక కారణం చూపిస్తూ బంద్ ప్రకటిస్తూ, ప్రజా రవాణాను పూర్తిగా స్తంభింప చేస్తున్నారని. దీనివల్ల సామాన్య జనులు, విద్యార్థులు, రోజువారీ కార్మికులు భయంతో, బాధతో జీవిస్తున్నారన్నారు. ఎవరికోసం ఈ బంద్ లు అంటూ ప్రశ్నించారు. పాఠశాలు, వైద్యం, రోజువారీ అవసరాల కోసం కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. “మావోయిస్టు కార్యకలాపాలకు బహిరంగ మద్దతు ఇవ్వడం. ఏజెన్సీప్రాంత శాంతి భద్రతలకు, అభివృద్ధి ప్రక్రియకు భంగం కలిగిస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా, మావోయిస్టు పార్టీ కార్యకలాపాల పట్ల తీవ్ర నిరసనను ప్రదర్శించారు. ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీస్ దళాన్ని కోరారు, మావోయిస్టుల కార్యకలాపాలను నిర్ణయాత్మకంగా అరికట్టాలని, తద్వారా ప్రాంత ప్రజలు భయముకు లేకుండా, అభివృద్ధి మార్గంలో సురక్షితంగా నడవగలరని.
చట్టి గ్రామ ప్రజలు, ఈ ప్రాంతం శాంతియుతంగా, ప్రగతిశీలంగా ఉండాలని తమ కోరికను పునరుద్ఘాటించారు. ఈ ధర్నాకు స్థానిక గ్రామస్తులు, వివిధ ప్రతినిధులు, సామాజిక సంస్థలు పాల్గొన్నారు.(Story:మావోయిస్టులు- మాకొద్దు కార్యకలాపాలకు తీవ్ర వ్యతిరేకత తెలిపిన గ్రామ ప్రజలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version