సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో బుగ్గపల్లితాండవాసుల ఆత్మీయ సమావేశం
న్యూస్తెలుగు/ వనపర్తి :
పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండా ప్రజలు,యువకులు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని హైదరాబాద్ వారి నివాసంలో కలసి తమ తండా సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన నిరంజన్ రెడ్డి గారు త్వరలో బుగ్గపల్లి తాండాను సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారితో కలసి అల్పాహారం తీసుకుని ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ రెడ్డి నీ కలసిన వారిలో గోపాల్ నాయక్,లాలూ నాయక్,నాను నాయక్,మల్లేష్ నాయక్,వెంకటయ్య,కిషన్ నాయక్,రమేష్ నాయక్,రమేష్ నాయక్,లక్మన్ నాయక్,మోహన్ నాయక్,మల్లేష్,తిరుపతి ఉన్నారు.(Story: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో బుగ్గపల్లితాండవాసుల ఆత్మీయ సమావేశం)

