కరేడు గవర్నమెంట్ పాఠశాల… జూనియర్ కాలేజీలలో హెచ్ ఐ వి పై అవగాహన కార్యక్రమం
న్యూస్ తెలుగు/ఒంగోలు : ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసై టీ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రెవెన్షన్ కంట్రోలు యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో కరేడు గవర్నమెంట్ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కాలేజీలలో హెచ్ ఐ వి/ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఓ ఆర్ డబ్ల్యు సుభాషిని మాట్లాడుతూ హెచ్ ఐ, ఎయిడ్స్ ,మరియు యువత మత్తు పదార్దాల వినియోగం వలన యువత భవిష్యత్తు మీద ప్రభావం ఉంటుందని వాటికి యువత దూరంగా ఉండాలని 2017ఎయిడ్స్ చట్టం గురించి హెల్ఫ్ లైన్ నెంబర్ 1097 ఉపయోగించి హెచ్ ఐ వి గురించినా సమాచారం తెలుసుకోవచ్చునని , హెచ్. ఐ వి. నాలుగు విధాలుగా వస్తుంది అని, సురక్షితం కానీ లైంగిక సంబంధాలు, సురక్షితం కానీ సూదులు సిరంజులు, పరీక్షించ బడనీ రక్తం , హెచ్ ఐ వి ఉన్న తల్లి నుంచి బిడ్డకు వస్తుందని చెప్పారు, హెచ్ ఐ వి అంటూ వ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అని, ప్రతి ఒక్కరు దీని పై అవగాహన కలిగి ఉండాలి , ఏ ఆర్ టి మందులు వాడటం వల్ల తమ జీవిత కాలాని పెంచుకోవచ్చని చెప్పారు, ఈ కార్యక్రమంలో ఓ ఆర్ డబ్ల్యు సుభాషిణి , హెడ్మాస్టర్ శ్రీనివాస రావు , ప్రిన్సిపల్ స్రవంతి గారు మరియు సిబ్బంది విద్యార్ధి, విద్యార్దులు , పాల్గొనడం జరిగింది.(Story : కరేడు గవర్నమెంట్ పాఠశాల… జూనియర్ కాలేజీలలో హెచ్ ఐ వి పై అవగాహన కార్యక్రమం )
