Homeవార్తలుతెలంగాణబాధితుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

బాధితుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

బాధితుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

న్యూస్ తెలుగు/వనపర్తి : నేరాల అదుపులకు పటిష్టమైన చర్యలు చేపడుతూ గస్తీ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్., అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా పరిధిలోని శ్రీరంగాపూర్ పోలీస్టేషన్ ” వార్షిక తనిఖీలలో ” భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ గారు సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్టేషన్లో రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేసి పోలీస్టేషన్ రిసెప్షన్, లాకప్ ,మెన్ బ్యారేక్, టెక్నికల్ రూం, పరిసరాలను పరిశీలించారు. పోలీస్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను శ్రీరంగాపూర్ ఎస్సై రామకృష్ణ ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… ప్రతి గ్రామంలో వార్డుకు పోలీసు అధికారిని కేటాయించి విపిఓ విధానాన్ని పక్కాగా అమలు చేస్తూ. గ్రామాలకు సంబంధించిన విపిఓలు రోజు గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని గ్రామాలలో ప్రజలతో స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించాలి ముఖ్యంగా ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా గస్తీ నిర్వహించాలన్నారు.పోలీస్టేషన్లో ఉన్న బ్లూ కోర్ట్, స్టేషన్ రైటర్స్, సెక్షన్ ఇంచార్జ్, పెట్రో కార్, రిసెప్షన్ లాంటి వర్టికల్స్ కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. శ్రీరంగాపూర్ మండలంలో గంజాయి, మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలి అన్నారు.రాత్రి సమయాలలో మరింత పటిష్టంగా గస్తీ పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరాల అదుపునకు కృషి చేయాలన్నారు. సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్నారు. ముఖ్యంగా కేసుల దర్యాప్తునందు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరైన సమయంలో దర్యాప్తు చేసి కోర్టుల నందు చార్జిషీటు దాఖలు చేసినప్పుడు బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు. దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, కొత్తకోట ఇన్చార్జి సీఐ, నరేష్, శ్రీరంగాపూర్ ఎస్సై, రామకృష్ణ, పెబ్బేరు ఎస్సై, యుగంధర్ రెడ్డి, డిసిఆర్బి ఎస్సై, తిరుపతి రెడ్డి , పెబ్బేరు రెండవ ఎస్సై, దివ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : బాధితుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!