23వార్డు సమగ్ర అభివృద్ధికి తోడ్పడింది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూస్తెలుగు/ వనపర్తి : పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్ ఆధ్వర్యములో బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ డైరెక్టర్ సబ్బిరెడ్డి.యుగంధర్ రెడ్డి మరియు శ్రేణులు 23వార్డులో ఇంటింటికి తిరిగి గతములో జరిగిన అభివృద్ధి గురించి వివరించడం జరిగింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి హయాములో హైస్కూల్ రోడ్ నుండి పీర్లగుట్ట వరకు అత్యంత నాణ్యవంతమైన సి.సి రోడ్డుతో పాటు కాలనీ మొత్తం రోడ్లు,మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు,పేద ప్రజలకు ఆసరా పింఛన్లు మరియు ప్రజల ఆరాధ్యదైవం జమ్ములమ్మ గుడి పునః నిర్మాణం,డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతులు కల్పించడం జరిగింది అని అన్నారు. వచ్చే ఎన్నికలో వలస నాయకులకు గుణపాఠం చెబుతామని పట్టణ అభివృద్ధి జరగాలంటే సార్…కారు సర్కార్ రావాలని ప్రజలు కోరుకున్నారు.
ఈ పర్యటనలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,నందిమల్ల.అశోక్ మాజీ కౌన్సిలర్స్ బండారు.కృష్ణ,ఉంగ్లం. తిరుమల్,నాగన్న యాదవ్, కంచ.రవి,గులాం ఖాదర్ ఖాన్, ఇమ్రాన్,నందిమల్ల.రమేష్,డాక్టర్.డ్యానియల్,మురళీ సాగర్,నందిమల్ల.సుబ్బు, మంద.రాము,మునికుమార్,నందిమల్ల.రవి,బొడ్డుపల్లి.సతీష్, శిరివాటి.శంకర్,సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, ఎంట్ల.శ్రీను,రంగన్న, అనపటి.రాము,విజయ్ సాగర్,శ్రీను, తదితరులు ఉన్నారు. (Story:23వార్డు సమగ్ర అభివృద్ధికి తోడ్పడింది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి)

